Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆల్కహాల్‌తో కరోనా వైరస్‌కు చెక్? డబ్ల్యూహెచ్‌వో ఏమంటోంది?

ఆల్కహాల్‌తో కరోనా వైరస్‌కు చెక్? డబ్ల్యూహెచ్‌వో ఏమంటోంది?
, సోమవారం, 9 మార్చి 2020 (14:14 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ల బారినపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇప్పటికీ 70 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అనేక కేసులు నమోదవుతున్నాయి. అంటే ఈ వైరస్ శరవేగంగా విస్తరిస్తుందనే ప్రచారం సాగుతోంది. దీంతో కొత్తకొత్త వదంతులు ప్రచారంలోకి వస్తున్నాయి. 
 
ఆల్కహాల్ తాగితే కరోనా వైరస్ చచ్చిపోతుందని ఒకటి, ఆల్కహాల్‌నుగానీ, క్లోరిన్‌నుగానీ శరీరంపై స్ప్రే చేసుకుంటే వైరస్ పోతుందని మరొకటి, వేడి నీళ్లతో స్నానం చేస్తే వైరస్ సోకదని ఇంకొకటి.. ఇలా ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. 
 
ముఖ్యంగా ఇంటర్నెట్‌లో, సోషల్ మీడియాలో ఎన్నో వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) సోమవారం ప్రకటన జారీచేసింది. ఆయా వదంతులు ప్రచారాలపై వివరణ ఇచ్చింది. 
 
కరోనా వైరస్ నేపథ్యంలో హ్యాండ్ శానిటైజర్లతో ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని డబ్ల్యూహె‌చ్‌వో, డాక్టర్లు ప్రకటించారు. హ్యాండ్ శానిటైజర్లలో 90 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది. మిగతా 10 శాతం మరికొన్ని రసాయనాలు ఉంటాయి. అంతేకాకుండా ఆల్కహాల్, క్లోరిన్ రెండూ సూక్ష్మజీవులను నాశనం చేస్తాయన్నది ముందు నుంచీ తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలోనే ఆల్కహాల్ తాగితే కరోనా వైరస్ చచ్చిపోతుందన్న ప్రచారం మొదలైంది. ఇదేసమయంలో ఆల్కహాల్, క్లోరిన్‌ను శరీరంపై పూసుకుంటే.. వైరస్ చచ్చిపోతుందన్న వదంతి కూడా వ్యాప్తిచెందింది. ఇవి రెండూ తప్పని డబ్ల్యూహెచ్‌వో వివరణ ఇచ్చింది.
 
ఆల్కహాల్‌తో వైరస్ వంటి సూక్ష్మ జీవులు చనిపోతాయన్నది నిజమేనని పేర్కొంది. అయితే ఆల్కహాల్ తాగితే అది కేవలం రక్తంలో కలిసి, ఫిల్టర్ అవుతుందని, ఏ సూక్ష్మక్రిమిపైనా ప్రభావం చూపడం ఉండదని డబ్ల్యూహెచ్‌వో స్పష్టంచేసింది. 
 
ఇక శరీరంపై ఆల్కహాల్, క్లోరిన్ పూసుకోవడం వల్ల చర్మంపై ఉండే వైరస్ చనిపోతుందని, అంతేకానీ, అప్పటికే శరీరం లోపలికి చేరిన వైరస్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని వివరించింది.
 
ఆల్కహాల్ ఉండే హ్యాండ్ రబ్‌లు, హ్యాండి శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల ఫలితం ఉంటుందని తెలిపింది.
 
ఇక వేడి నీళ్లతో స్నానం చేస్తే వైరస్ రాదన్న ప్రచారం కూడా అవాస్తవమని చెప్పింది. అయితే వేడి నీళ్లతో గొంతు పుక్కిలించడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుందని పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమృత చేసిన తప్పుతో మారుతి ఫ్యామిలీ చిన్నాభిన్నం