Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో 73 రోజుల కనిష్టానికి కోవిడ్ పాజిటివ్ కేసులు

దేశంలో 73 రోజుల కనిష్టానికి కోవిడ్ పాజిటివ్ కేసులు
, శుక్రవారం, 18 జూన్ 2021 (10:19 IST)
దేశంలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 62,480 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 
 
కొత్తగా 62480 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇవి 73 రోజుల తర్వాత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. అలాగే, కొత్తగా 88,977 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. మరో 1,587 మంది వైరస్‌ బారినపడి మృతి చెందారని తెలిపింది. 
 
కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,97,62,793కు చేరింది. మొత్తం 2,85,80,647 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ బారినపడి ఇప్పటివరకు 3,83,490 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
ప్రస్తుతం దేశంలో 7,98,656 యాక్టివ్‌ కేసులున్నాయని వివరించింది. టీకా డైవ్‌లో భాగంగా ఇప్పటివరకు 26,89,60,399 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. వరుసగా 36వ రోజు రోజువారీ కొత్త కేసులను రికవరీలు మించిపోయాయని చెప్పింది. జాతీయ రికవరీ రేటు ప్రస్తుతం 96.03 శాతానికి పెరిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జోకర్ లింక్ క్లిక్ చేశారో... మీ ఖాతా ఖాళీనే...