Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. 2,219 మంది మృతి

Advertiesment
India
, బుధవారం, 9 జూన్ 2021 (10:06 IST)
భారత్‌లో కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. కానీ పాజిటివ్ కేసులు, మరణాలు స్వల్పంగా పెరిగాయి. వరుసగా రెండోరోజు లక్షకు దిగువన కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 92,596 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా...2,219 మంది మృతి చెందారు.

నిన్న ఒక్కరోజే 1,62,664 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో వ్యాప్తంగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,90,89,069కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 
 
ప్రస్తుతం 12,31,415 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా నుండి ఇప్పటి వరకు 2,75,04,126 మంది బాధితులు కోలుకున్నారు. కొవిడ్-19 వైరస్ సోకి ఇప్పటి వరకు 3,53,528 మంది మృతి చెందారు.

దేశవ్యాప్తంగా రికవరీ రేటు 94.55 శాతం కాగా, మరణాల రేటు 1.22శాతంగా ఉంది. ఇప్పటి వరకు 23,90,58,360 మందికి కరోనా టీకాలు వేయించుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాలుగు నెలల పాటు 100కిలో మీటర్లు.. 4 నదులు దాటిన పులి