Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

కరోనా కేసుల్లో ఆసియాలోనే భారత్ రికార్డు...

Advertiesment
India
, సోమవారం, 1 జూన్ 2020 (11:48 IST)
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా ఆసియా దేశాల్లోనే భారత్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. కరోనా కేసుల్లో ఆసియా దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. సోమవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల మేరకు గత 24 గంటల్లో దేశంలో రికార్డుస్థాయిలో 8,392 మందికి కొత్తగా కరోనా సోకగా, 230 మంది మరణించారు. 
 
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,90,535కి చేరగా, మృతుల సంఖ్య 5,394కి చేరుకుంది. 93,322 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 91,819 మంది కోలుకున్నారు. 
 
కరోనా కేసులపై పీకే సంచలన ట్వీట్ 
ఇదిలావుంటే, దేశంలో నమోదవుతున్న కరోనా కేసులపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్ సంచలన ట్వీట్ చేశారు. లాక్డౌన్ 1.0 నుంచి అన్‌లాక్ 1.0 మధ్య నమోదైన కేసుల వివరాలను వెల్లడించారు. 
 
కొవిడ్-19 కేసుల సంఖ్యను ఓ మారు గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు. లాక్డౌన్ తొలి దశ నుంచి అన్లాక్ 1.0 మధ్య కరోనా కేసులు 1002 రెట్లు పెరిగాయని, మరణాలు 1,348 రెట్లు పెరిగాయని అన్నారు. ప్రపంచంలోనే కేసుల సంఖ్యలో 7వ స్థానంలో, మరణాల సంఖ్యలో 13వ స్థానంలో భారత్ ఉందని గుర్తుచేశారు. 
 
టెస్టుల తర్వాత పాజిటివ్ వస్తున్న కేసుల శాతం 1.3 నుంచి 5 శాతానికి పెరిగిందని, కేసులు నమోదైన జిల్లాల సంఖ్య 68 నుంచి 634కు చేరిందని తెలిపారు. జీ-20 దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుదల విషయంలో రెండో స్థానంలోనూ, మరణాల పెరుగుదలలో 4వ స్థానంలోనూ భారత్ ఉందన్నారు. 
 
మార్చి 20 నాటికి 190 కేసులున్న భారతావనిలో జూన్ 1 నాటికి 1,90,535 కేసులు వచ్చాయని, రోజువారీ నమోదవుతున్న పాజిటివ్ కేసుల వారం రోజుల యావరేజ్ అప్పట్లో 16గా ఉండగా, ఇప్పుడు 461 రెట్లు పెరిగి 7,384కు చేరిందని ప్రశాంత్ కిషోర్ గుర్తుచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయవాడ,సికింద్రాబాద్‌ లలో ప్రారంభమైన రైళ్లు