Publish Date: Wed, 17 Feb 2021 (19:11 IST)
Updated Date: Wed, 17 Feb 2021 (19:13 IST)
ఏపీలో కరోనా కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 26,474 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 51 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,89,010కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,165 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 57 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,81,238కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 607 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,36,15,847 కరోనా సాంపుల్స్ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్లో వెల్లడించింది.