Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెండి ఇటుకలు పంపొద్దు.. బ్యాంకు లాకర్లలో స్థలం లేదు..

వెండి ఇటుకలు పంపొద్దు.. బ్యాంకు లాకర్లలో స్థలం లేదు..
, బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (19:06 IST)
రామజన్మ భూమి అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి వెండి ఇటుకలు ఎవరూ పంపవద్దని శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది. భక్తులు బహూకరించిన వెండి ఇటుకలను భద్రపరచడానికి బ్యాంకు లాకర్లలో స్థలం లేదని, అందుకే ఎవరూ వెండి ఇటుకలను సమర్పించవద్దని కోరింది. ఇప్పటి వరకు 400 కిలోగ్రాముల వెండి ఇటుకలను భక్తులు సమర్పించారని ట్రస్ట్ పేర్కొంది. 
 
''రామ మందిర నిర్మాణానికి దేశంలో అనేక మంది భక్తులు వెండి ఇటుకలను బహూకరిస్తున్నారు. మరికొన్ని కూడా వస్తున్నాయి. అయితే వాటిని ఎలా భద్రపరచాలన్న విషయంలో ఆలోచిస్తున్నాం. ప్రస్తుతానికి ఎవరూ వెండి ఇటుకలను బహూకరించవద్దు. బ్యాంక్ లాకర్లన్నీ నిండిపోయాయి.'' అని ట్రస్ట్ ప్రకటించింది. అయితే భక్తుల మనోభావాలను తాము అత్యంత శ్రద్ధతో అర్థం చేసుకుంటామని, అయినా సరే... భక్తులెవరూ వెండి ఇటుకలను బహూకరించవద్దని కోరింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ అలవాటు వుందని విడాకులు ఇవ్వలేం... నాగ్‌పూర్ కోర్టు