Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో విస్తరిస్తున్న కరోనా, 110 కేసులు నమోదు, ఇటలీలో ఒక్కరోజే 350 మంది మృతి

దేశంలో విస్తరిస్తున్న కరోనా, 110 కేసులు నమోదు, ఇటలీలో ఒక్కరోజే 350 మంది మృతి
, సోమవారం, 16 మార్చి 2020 (14:57 IST)
చైనాలో పుట్టిన కరోనా వైరస్ - COVID 19 ప్రపంచంలో ఇప్పటివరకూ 157 దేశాలకు వ్యాపించింది. చైనాలో దీని ప్రభావం దాదాపు తగ్గిపోవడంతో అక్కడ క్రమంగా షాపులు తెరుచుకుంటున్నాయి. కానీ భారతదేశం పైన కరోనా పంజా విసురుతోంది. మరోవైపు ప్రపంచంలోని దేశాలలో ఇటలీ కరోనా వైరస్ ప్రభావంతో అతలాకుతలమవుతోంది. నిన్న ఒక్కరోజే 350 మందికి పైగా ఈ వ్యాధి కారణంగా మృత్యువాత పడ్డారు. దీనితో ఇటలీలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. 
 
మన దేశం విషయానికి వస్తే ఆదివారం నాడు ఒక్కరోజే 11 మందికి కొత్తగా కరోనా వైరస్ అంటుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కరోనా కేసుల విషయంలో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలుస్తోంది. ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లో కరోనా పంజా విసురుతోంది. జనవరి 30 నుంచి మార్చి 16 వరకు మన దేశంలో 110 కేసులు నమోదవగా అందులో 95 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకరు ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నారు. ఇక 12 మందికి కరోనా నెగటివ్‌గా నిర్ధారణై ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. ఇద్దరు కరోనా కారణంగా మృతి చెందారు. మరోవైపు ప్రభుత్వాలు కరోనా వైరస్ అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరీంనగర్‌లో కరోనా కలకలం : 13 మందిలో వైరస్ లక్షణాలు