Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో కరోనా మరణ మృదంగం.. ఒక్కరోజే 4,120 మంది మృతి

దేశంలో కరోనా మరణ మృదంగం.. ఒక్కరోజే 4,120 మంది మృతి
, గురువారం, 13 మే 2021 (13:28 IST)
దేశంలో కరోనా మరణ మృదంగం మోగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా కొత్తగా 3,62,727 కరోనా కేసులు నమోదు అయితే నిన్న ఒక్కరోజే 4,120 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో 3,52,181 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
దేశవ్యాప్తంగా కరోనా బారిన పడినవారు 2,37,03,665 కాగా ఇప్పటి వరకు 2,58,317 మంది మరణించారు. దేశంలో 37లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
నిన్న ఒక్కరోజే 18,64,594 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 3.62 లక్షల మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో ఇప్పటివరకు 17.52 కోట్లకుపైగా టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కనిపించుట లేదు : ఠాణాలో ఫిర్యాదు