Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. ఒక్క రోజు వ్యవధిలో నలుగురు మృతి

ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. ఒక్క రోజు వ్యవధిలో నలుగురు మృతి
, సోమవారం, 30 నవంబరు 2020 (20:50 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులిటెన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 381 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,65,169కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో నలుగురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 6992కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,840 యాక్టివ్‌ కరోనా కేసులున్నాయి.
 
ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 8,50,337 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే ఏపీలో 40 , 7౨౦8 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 100,57,854 కరోనా పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 
 
అలాగే జిల్లాల వారీగా చూస్తే అనంతపురంలో 21, చిత్తూరు 31, తూర్పుగోదావరి జిల్లాలో 45, గుంటూరు 35, కడపలో 26, కృష్ణాలో 70 కర్నూలులో 12, నెల్లూరు 19, ప్రకాశంలో 7, శ్రీకాకుళంలో 10, విశాఖపట్నంలో 11, విజయనగరంలో 20, పశ్చిమ గోదావరిలో 74 కేసులు నమోదయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అస్సాంలో అరుదైన తాబేలు