Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జెఈఈ అడ్వాన్స్డ్ 2023లో అత్యద్భుతమైన ఫలితాలను సాధించిన కరీంనగర్‌ లోని ఇద్దరు ఆకాష్ బైజూస్ విద్యార్థులు

image
, మంగళవారం, 20 జూన్ 2023 (16:27 IST)
టెస్ట్ ప్రిపరేషన్ సేవలలో జాతీయ అగ్రగామి ఆకాష్‌ బైజూస్‌, కరీంనగర్‌ లోని విద్యార్థులు ఇద్దరు అత్యంత ప్రతిష్టాత్మకమైన జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (జెఈఈ) అడ్వాన్స్డ్ 2023లో అద్భుతమైన ఫలితాలు సాధించి తల్లిదండ్రులతో పాటుగా ఇనిస్టిట్యూట్‌కు గర్వకారణంగా నిలిచారు. ఈ ఇద్దరు విద్యార్థులలో వేముల సిద్ధార్ధ  1056 ర్యాంక్ సాధించగా, సంకిటి ఐశ్వర్య రెడ్డి 3683 ర్యాంక్ సాధించింది. ఈ ఫలితాలను ఐఐటీ గౌహతి నేడు విడుదల చేశారు. 
 
ప్రపంచంలో అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షగా భావిస్తోన్న జెఈఈలో విజయం సాధించేందుకు వీరు ఆకాష్‌ బైజూస్‌ ఇనిస్టిట్యూట్‌లో క్లాస్ రూమ్ ప్రోగ్రామ్‌లో చేరారు. కాన్సెప్ట్‌లను అర్ధం చేసుకోవడంలో తాము పడిన కష్టం, లెర్నింగ్‌ షెడ్యూల్స్‌కు కట్టుబడి ఉండటమే తమ విజయానికి కారణంగా అభివర్ణించారు. ఆకాష్ బైజూస్ అందించిన కోచింగ్, కంటెంట్ తమ విజయానికి తోడ్పడ్డాయంటూ వారి శిక్షణ కారణంగానే అతి స్వల్ప కాలంలోనే కాన్సెప్ట్స్ అర్థం చేసుకోగలిగామన్నారు. 
 
విద్యార్థులను అభినందించిన ఆకాష్‌ బైజూస్‌ రీజనల్ డైరెక్టర్ శ్రీ ధీరజ్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ, ‘‘అసాధారణ ప్రతిభ కనబరిచిన విద్యార్ధులను అభినందిస్తున్నాను. వారు పడిన కష్టం, అంకితభావం మరియు వారి తల్లిదండ్రులు అందించిన మద్దతు గురించి ఈ ఫలితాలు ఎంతో వెల్లడిస్తాయి. భవిష్యత్‌లో మరిన్ని విజయాలను వారు సాధించాలని ఆకాంక్షిస్తున్నాము’’ అని అన్నారు. మొత్తం మీద 1.8 లక్షల మంది విద్యార్థులు జెఈఈ (అడ్వాన్స్డ్) 2023 కోసం హాజరయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కంటే చాలా మేధావి బ్రహ్మానందం.. అంబటి రాంబాబు