Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాత్రిపూట రైళ్లల్లో ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లకు ఛార్జింగ్ పెట్టలేం..!

Advertiesment
Railways
, మంగళవారం, 30 మార్చి 2021 (21:52 IST)
రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పేర్కొంది. ఇందులో భాగంగా రైల్వే ప్రయాణికులు రాత్రివేళల్లో రైలు కోచ్‌లలో ఛార్జింగ్‌ పాయింట్లను ఇకపై ఉపయోగించలేరని వెల్లడించింది. 
 
అగ్ని ప్రమాదాలను నివారించడంలో భాగంగా రాత్రి సమయంలో ఛార్జింగ్‌ పాయింట్ల వాడకంపై నిషేధం విధించింది. ఇటీవల ఢిల్లీ-డెహ్రాడూన్‌ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక కోచ్‌లో మొదలైన మంటలు ఏడు బోగీలకు వ్యాపించాయి.
 
ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైళ్లలో ఛార్జింగ్ పాయింట్లను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు స్విచ్ ఆఫ్ చేయాలని రైల్వే నిర్ణయించినట్లు వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ తెలిపారు. 
 
ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు రాత్రిపూట ఛార్జింగ్‌ పెట్టే క్రమంలో కొన్నిసార్లు అవి వేడెక్కడం వల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో మంటలు సంభవిస్తున్నాయి. దీంతో ఇతర రైల్వే జోన్లలో కూడా ఈ నిబంధనలను అమలు చేస్తున్నట్లు ఠాకూర్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఔను... పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి - సోము వీర్రాజు వ్యాఖ్యలను సమర్థిస్తున్నా: జీవీఎల్