Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దసరా రద్దీ : ప్రత్యేకం పేరుతో భారీ వడ్డన - రైల్వే మాయ

Advertiesment
దసరా రద్దీ : ప్రత్యేకం పేరుతో భారీ వడ్డన - రైల్వే మాయ
, శనివారం, 9 అక్టోబరు 2021 (07:52 IST)
రైల్వే శాఖ ప్రయాణికులపై అమితంగా భారీ మోపుతోంది. దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకం పేరుతో భారీగా ప్రయాణ చార్జీలను వసూలుకు శ్రీకారం చుట్టుంది. ప్రత్యేక రైళ్లు, తత్కాల్ పేరుతో ప్రయాణికులు భరించలేనంతగా చార్జీలు వసూలు చేస్తోంది. 
 
రైల్వే తాజా నిర్ణయంతో రైలు, ప్రయాణం చేసే క్లాస్‌ను బట్టి ఒక్కో ప్రయాణికుడిపై అదనంగా రూ.200 నుంచి రూ.700 వరకు భారం పడుతోంది. దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు సొంత రాష్ట్రాలకు పయనమవుతున్నారు. 
 
దీంతో అనూహ్యంగా పెరిగిన రద్దీని తట్టుకునేందుకు రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. ఈ రైళ్ల టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ నెల 14న హైదరాబాద్ - విశాఖపట్టణం గరీభ్‌ రథ్ రైలు టికెట్లన్నీ కొన్ని గంటల్లోనే అమ్ముడుపోగా, 142 మంది ఇంకా వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. అదే రోజు హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు 16 రైళ్లు వెళ్లనుండగా రెండు, మూడు మినహా అన్నింటిలోనూ టికెట్లు అయిపోయాయి. ఈ రైళ్లలో టిక్కెట్లన్నీ ప్రత్యేకం పేరుతో భారీ ధరకు అమ్ముకోవడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‘మా’ ఎన్నికల్లో కచ్చితంగా ఓటు వేస్తున్నా: సిద్దార్థ్