Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దసరా పండగ పూట వంటిల్లో ధరల మంట

దసరా పండగ పూట వంటిల్లో ధరల మంట
, బుధవారం, 13 అక్టోబరు 2021 (09:36 IST)
దేశంలో ఒకపైవు పెట్రోల్, డీజల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరోవైపు, గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు షాకిచ్చాయి. దసరా పండుగ ముందు వంట గ్యాస్ మంటపెట్టారు. గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెంచేశారు. 
 
14.2 కేజీల సాధారణ వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.15 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.899.50కు చేరింది. పెరిగిన ధరలు బుధవారం నుంచే అమల్లోకి రానుంది. దీంతో గ్యాస్ సిలిండర్ వాడే వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. 
 
ఢిల్లీలో సబ్సిడీ లేకుండా 14.2 కిలోల సిలిండర్ ధర ఇప్పుడు రూ.899.50కి పెరిగింది. కోల్‌కతాలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.911 నుంచి రూ.926కి, ముంబైలో రూ.844.50 నుండి రూ.899.50కి పెరిగింది. చెన్నైలో సబ్సిడీయేతర సిలిండర్ ధర ఇప్పుడు రూ.915.50. 
 
ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య గ్యాస్ ధర రూ.1736.5. కోల్‌కతాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1805.5. ముంబైలో రూ.1685, చెన్నైలో రూ.1867.50గా ఉంది. సహజ వాయువు ధరల పెరుగుదల కారణంగా సీఎన్జీ, జీఎన్జీ వంట గ్యాస్ ధరలు పెరిగాయి. 
 
ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజిఎల్) ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో సిఎన్‌జి ధరను కిలోకు రూ.2.55 వరకు పెంచింది. అదే సమయంలో పీఎన్జీ ద్వారా ధర క్యూబిక్ మీటర్‌కు రూ.2.10 పెరిగింది.
 
మంగళవారం మహానగర్ గ్యాస్ లిమిటెడ్ తక్షణం అమలులోకి వచ్చేలా సీన్జీజీ, పీఎన్జీ రిటైల్ ధరను కిలోకు రూ.2 పెంచింది. ముంబైలో అన్ని పన్నులతో కలిపి సీఎన్జీ ఇప్పుడు కేజీకి రూ.54.57గా ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నడ్డివిరుస్తున్న పెట్రోల్ - డీజల్ భారం