Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనుకున్నదే నిజమైంది.. ఎన్నికలైన మరుసటి రోజే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

అనుకున్నదే నిజమైంది.. ఎన్నికలైన మరుసటి రోజే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..
, సోమవారం, 20 మే 2019 (18:00 IST)
లోక్‌సభ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు 8-10 పైసలు మేర పెరగ్గా, డీజిల్ ధరలు మాత్రం 15-16 పైసలు మేర పెరిగాయి. 
 
ప్రముఖ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ డేటా ప్రకారం ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.71.12 కాగా, డీజిల్ ధర రూ.66.11గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధర పెరగడం వల్లే దేశీయ మార్కెట్‌లోనూ ఇంధన ధరలు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు.
 
చమురు ఉత్పత్తి దేశాలు పరిమిత క్రూడ్ ఆయిల్ సరఫరా చేయడానికి ఒప్పుకున్నట్లు సౌదీ మంత్రి ఖలీద్ అల్ ఫలీహ్ ప్రకటించిన తర్వాత ధరలు 1% మేర పెరిగాయి. ప్రస్తుతం ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.76.73, డీజిల్ ధర రూ.69.27గా ఉంది. కోల్‌కతా, చెన్నైలలో లీటరు పెట్రోల్ ధర రూ.73.19 నుంచి ధర రూ.73.82కి ఎగబాకింది. డీజిల్ ధర రూ.67.86 నుంచి రూ.69.88కి పెరిగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్కెట్‌లోకి జిక్సర్ మోడల్ బైక్‌లు.. స్పెషాలిటీ ఏంటో తెలుసా?