Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆనంద్‌తో ఇషా అంబానీ నిశ్చితార్థం

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ నిశ్చితార్థం ముగిసింది. ప్రముఖ ఫార్మా ఇండస్ట్రియలిస్ట్ అజయ్ పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్‌తో ఈ నిశ్చితార్థం జరిగింది. ఇది ఈషా మహాబలేశ్వరంలో

ఆనంద్‌తో ఇషా అంబానీ నిశ్చితార్థం
, సోమవారం, 7 మే 2018 (13:00 IST)
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ నిశ్చితార్థం ముగిసింది. ప్రముఖ ఫార్మా ఇండస్ట్రియలిస్ట్ అజయ్ పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్‌తో ఈ నిశ్చితార్థం జరిగింది. ఇది ఈషా మహాబలేశ్వరంలోని ఓ గుడిలో ఉంగరాలు మార్చుకున్నట్లు సమాచారం. ఆనంద్‌, ఇషాలు చిన్ననాటి స్నేహితులు.
 
కొద్దిరోజుల క్రితం మహాబలేశ్వరంలోని ఓ గుడిలో ఆనంద్‌, ఇషాకు ప్రపోజ్‌ చేశారు. ఇషా కూడా అంగీకారం తెలపడంతో అక్కడే ఉంగరాలు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత వారి వారి కుటుంబాలకు విషయం చెప్పారు. మఖేష్ కుమారుడు ఆకాశ్‌ అంబానీ, శ్లోకా మెహతాల వివాహం కంటే ముందే ఆనంద్‌, ఇషాల వివాహం జరిగే అవకాశం ఉంది. 
 
అయితే, ఆనంద్ - ఇషాల పెళ్లి తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. పైగా, దీనిపై ముఖేష్, అజయ్ కుటుంబ సభ్యులు ఓ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా, ఆనంద్‌ పిరమల్ దేశంలో పిరామల్‌ ఈ-స్వాస్థ్య, పిరామల్‌ రియాల్టీ అనే స్టార్టప్ కంపెనీలను ప్రారంభించి, విజయవంతంగా నడుపుతున్న విషయం తెల్సిందే. ఇషా రిలయన్స్ జియో, రిలయన్స్‌ రిటైల్‌ బోర్డుల్లో సభ్యురాలిగా ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శునకాలు ఓట్లు వేయవు కదా.. మోదీ అబద్ధాల పుట్ట: ప్రకాష్ రాజ్