Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కూతురిపై అత్యాచారం చేశాడు... మరో నలుగురిని పిలిచి రేప్ చేయించాడు

అడుగడుగునా రాబందులు. అదును చూసి కాటేస్తున్న కామాంధులు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామాంధుడయ్యాడు. కన్నబిడ్డపై పైశాచికత్వానికి పాల్పడ్డాడు. వావివరుసలు మరిచిన మృగాడు. తన వాంఛను తీర్చుకోవడానికి తం

కూతురిపై అత్యాచారం చేశాడు... మరో నలుగురిని పిలిచి రేప్ చేయించాడు
, బుధవారం, 2 మే 2018 (18:47 IST)
అడుగడుగునా రాబందులు. అదును చూసి కాటేస్తున్న కామాంధులు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామాంధుడయ్యాడు. కన్నబిడ్డపై పైశాచికత్వానికి పాల్పడ్డాడు. వావివరుసలు మరిచిన మృగాడు. తన వాంఛను తీర్చుకోవడానికి తండ్రి చేసిన దుశ్చర్య ఇది. సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఇది.
 
చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన నాగరాజుకు 18 యేళ్ళ కుమార్తె ఉంది. భార్య అనారోగ్యంతో మూడేళ్ళ క్రితమే చనిపోయింది. వేరే పెళ్లి చేసుకున్న నాగరాజు ఇంటి నుంచి వెళ్ళిపొమ్మని వేధిస్తూ వచ్చాడు. నాకు మీకన్నా ఎవరున్నారు అని కుమార్తె రోదించినా వినలేదు. దీంతో తండ్రే కామాంధుడిగా మారిపోయాడు. నెలరోజుల క్రితం కుమార్తె నిద్రిస్తుంటే అత్యాచారం చేశాడు. అంతటితో ఆగలేదు.. ఆ విషయం బయటకు చెబితే చంపేస్తానన్నాడు. తండ్రే కదా అనుకుని కుమార్తె బాధను తనలోనే దాచుకుంది. ఆ తరువాత తన స్నేహితులను తీసుకొచ్చాడు. వారితో గడపమన్నాడు. ఇలా ఐదుగురికి కన్న కుమార్తెను వారికి అప్పగించేశాడు. 
 
కన్న తండ్రి వేధింపులు తట్టుకోలేక స్థానికుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది అభాగ్యురాలు. దీంతో నిందితుడు పరారయ్యాడు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్ గూటికి ఎస్‌.ఎం. కృష్ణ??