Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి లావా బ్లేజ్ వచ్చేసింది.. ధర ఎంతంటే...

lava blaze pro
, గురువారం, 22 సెప్టెంబరు 2022 (12:41 IST)
దేశీ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి లావా బ్లేజ్ పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ మోడల్ అందుబాటులోకి వచ్చింది. లావా బ్లేజ్ మీడియాటెక్ హెలియో జి37 ఎస్ఓసీ పేరుతో వచ్చిన ఈ ఫోన్ 40 ర్యామ్, 64 జీవీ ఇంటెగ్రల్ స్టోరేజ్‌తో వీడుదల చేశారు. 
 
ఇండియన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్‌గా ఆవిష్కరించిన ఇది బడ్జెట్ ఫోన్‌గా అభివర్ణిస్తున్నారు. లావా బ్లేజ్ ప్రో ధర కూడా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా ఉంది. ప్రధానంగా యువకులను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని ఈఫోన్‌ను 50 ఎంపీ మైన్ లెన్స్‌తోపాటు మీడియాటెక్ ప్రాసెసర్‌తో ప్రవేశపెట్టారు. దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ కొనసాగుతున్నారు.
 
లావా బ్లేజ్ ప్రో స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల నాట్చ్ హెచ్.డి. డిస్ప్లే, 90 హెచ్.జడ్ రీఫ్రెష్ రేట్, 256 జీబీ మైక్రో ఎస్డీ కార్డు. ఆండ్రాయిడ్ 12తో ఇది పనిచేలా చేశారు. ఈ ఫోను ధర రూ.10499గా ఖరారు చేయగా ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రీటైల్ షాపులలో అందుబాటులో ఉంచారు. ఈ ఫోన్ గ్లాస్ గ్రీన్, గ్లాస్ ఆరెంజ్, గ్లాస్ బ్లూ, గ్లాస్ గోల్డ్ రంగుల్లో లభ్యంకానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశ వ్యాప్తంగా ఎన్.ఐ.ఏ సోదాలు.. 100 మంది పీఎఫ్ఐ కార్యకర్తల అరెస్టు