Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత సంతతికి చెందిన గీతా గోపీనాథ్‌కు కీలక పదవి

భారత సంతతికి చెందిన గీతా గోపీనాథ్‌కు కీలక పదవి
, శుక్రవారం, 3 డిశెంబరు 2021 (16:23 IST)
భారత సంతతికి చెందిన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌కు కీలక పదవి వరించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థలో రెండో అతిపెద్ద పదవికి ఆమెను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆమె ఐఎంఎఫ్‌లో చీఫ్ ఎకనామిస్టుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె టాప్-2 పదవికి ఎంపిక చేశారు. 
 
వచ్చే నెలలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ప్రసుత ఎండీ జాఫ్రీ ఒకమోటో వచ్చే యేడాది జనవరి నెలలో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆ పదవికి గీతా గోపీనాథ్‌ను ఎంపిక చేశారు. నిజానికి ఆమె వచ్చే యేడాది హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో అకడమిక్ పొజిషన్‌కు వెళ్లాల్సివుంది. కానీ, ఆమెను ఐఎంఎఫ్‌లోని టాప్-2 పోస్టుకు ఎంపిక చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి పడబోయిన మహిళ.. అలా కాపాడాడు...