Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బంగారం, వెండి ధరల పెంపు.. కారణం డొనాల్డ్ ట్రంప్ ప్రకటనే కారణం..

Advertiesment
gold

సెల్వి

, సోమవారం, 14 జులై 2025 (11:21 IST)
బంగారం, వెండి ధరలు బాగా పెరిగాయి. బంగారం రూ.400 కంటే ఎక్కువ పెరిగింది. వెండి కిలోగ్రాముకు రూ.2,700 కంటే ఎక్కువ పెరిగింది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకారం, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.97,511కి పెరిగింది. ఇది వారం క్రితం రూ.97,021గా ఉంది. రూ.490 పెరిగింది. 
 
మునుపటి వారంలో, బంగారం ఇప్పటికే 10 గ్రాములకు రూ.1,237 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.89,320కి పెరిగింది. ఇది రూ.88,871గా ఉంది. ఇదే సమయంలో, 18 క్యారెట్ల బంగారం రూ.72,766 నుండి రూ.73,133కి పెరిగింది.
 
వెండి కూడా బాగా పెరిగి, కిలోకు రూ.2,710 పెరిగి రూ.1,10,290కి చేరుకుంది.గత వారం రూ.1,07,580గా ఉంది.
వారం ప్రాతిపదికన వెండి కిలోకు రూ.1.10 లక్షలకు మించి ముగియడం ఇదే మొదటిసారి, ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి.

విలువైన బంగారం ధరలు పెరిగేందుకు ప్రపంచ అనిశ్చితి కారణమని చెబుతున్నారు. కెనడా, యూరప్, ఇతర దేశాల వంటి కీలక వాణిజ్య భాగస్వాములపై సుంకాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచ మార్కెట్లలో పెరుగుతున్నధరలకు కారణమైంది. 
 
ఈ సంవత్సరం జనవరి 1 నుండి, 24 క్యారెట్ల బంగారం ధర రూ.21,349 లేదా 28.03 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.76,162 నుండి రూ.97,511కి చేరుకుంది.
 
అదేవిధంగా, వెండి ధర కూడా రూ.24,273 లేదా 28.21 శాతం పెరిగి కిలోగ్రాముకు రూ.86,017 నుంచి రూ.1,10,290కి చేరుకుంది. వెండి ధర ఇప్పటివరకు ఇదే అత్యధిక ధర. ఈ ఏడాది జూన్ 18న నమోదైన కిలోకు రూ.1,09,550గా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Hyderabad: గంజాయి కొనేందుకు వచ్చి టెక్కీలు, విద్యార్థితో పాటు 14మంది అరెస్ట్