Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్షయ తృతీయ: దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

gold
, శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (12:54 IST)
బంగారం కొనాలనుకుంటున్న వారికి శుభవార్త. బంగారం, వెండి ధరలు మరోసారి దిగొచ్చాయి. మరో నాలుగు రోజుల్లో అక్షయ తృతీయ ఉండటంతో.. తగ్గుతోన్న ధరలు దేశీయంగా మహిళలకు శుభవార్తగా నిలుస్తున్నాయి. 
 
శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.450 తగ్గింది. దీంతో పసిడి రేటు రూ.48 వేలకు చేరింది. 
 
అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.490 తగ్గుదలతో రూ.52,370కు దిగొచ్చింది. బంగారంతో పాటు వెండి ధరలు భారీగా పడిపోయాయి. 
 
కేజీ వెండిపై వెయ్యి రూపాయల మేర ధర తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.69 వేలకు పడిపోయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రంజాన్- హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షలు