Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజయవాడ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు..

విజయవాడ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు..
, శుక్రవారం, 24 జనవరి 2020 (16:43 IST)
భారతీయ రైల్వే" ప్రయాణికుల సేవా కమిటీ" ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడ రైల్వే స్టేషన్‌లో ప్రజల సౌకార్యార్థం తనిఖీలు నిర్వహించారు. ఈ కమిటీలో వివిధ రాష్ట్రలనుండి సభ్యులు పాల్గొన్నారు.

మన ప్రాంతానికి చెందిన 1).శ్రీ వెంకటరమణి (ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు) 2).  శ్రీ సూరీన్డెర్ భగత్(కాశ్మీర్) 3).శ్రీమతి రేష్మ హుస్సేన్ (రాజస్థాన్)  4). జై.ఎల్ నగ్వాని (మహారాష్ట్ర) 5).  జి.ఎస్.సేథీ (ఝార్ఖండ్) 6). ఎం.ఎన్. సుందర్ (తమిళనాడు) వీరితో దక్షిణ మధ్య రైల్వే అధికారులు,కాంట్రాక్టర్లు, పాల్గొనగా కమిటీ సభ్యులను మర్యాదపూర్వకంగా కలసి కొన్ని ముఖ్య సూచనలు చేశారు.
 
నరేంద్రమోదీ గారి స్వచ్ఛతా అభియాన్‌ను మరింత పటిష్ట పరిచి ప్రయాణికులకు మంచి సౌకర్యాలు కల్పించాలని హైద్రాబాద్ నుండి విజయవాడ వరకు ప్రత్యేక రైళ్లు రాత్రి సమయాలు ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర  కార్యదర్శి అడపా శివంగేంద్రరావు,భాజపా విజయవాడ జిల్లా అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి గారు,లక్ష్మీపతి రాజా, అడ్డురి శ్రీరామ్, పీయూష్ దేశాయ్,ఎల్.ఆర్. కె. ప్రసాద్,దాసం ఉమామహేశ్వరరాజు, వాసా పల్లపురాజు,యాలసిల శ్రీనివాసరావు, ఆర్ముగం,రైల్వే  జెడ్. ఆర్.యు. సి. సి. మెంబెర్ ,భాజపా మీడియా కన్వీనర్ వుల్లూరి గంగాధర్ పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చివరి కోరిక ఏమైనా వుందా? నిర్భయ దోషులకు జైలు అధికారుల ప్రశ్న