Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎస్పీబీకి అమూల్ గొప్ప నివాళి.. అమూల్ బేబీతో బాలు పాట

ఎస్పీబీకి అమూల్ గొప్ప నివాళి.. అమూల్ బేబీతో బాలు పాట
, శనివారం, 26 సెప్టెంబరు 2020 (12:52 IST)
పాల ఉత్పత్తుల దిగ్గజం అమూల్ సంస్థ గానగంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం (74)కు గొప్ప నివాళి అర్పించింది. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతో కలిసి అమూల్ బేబీ పాట పాడుతున్నట్లుగా ఉన్న ఓ బ్లాక్ అండ్ వైట్ డూడుల్‌ను అమూల్ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు, ఎస్పీబీ పాపులర్ పాటల్లో ఒకటైన 'తేరే మేరే బీచ్ మే కైసా తా యే బంధన్ అంజనా...' అన్న చరణాలను ఆ డూడుల్‌పై రాసింది.
 
సందర్భానుసారం సరైన కొటేషన్‌తో అమూల్ చేసిన ఈ పోస్టు చాలామందిని ఆకట్టుకుంటోంది. బాలుకు ఇది గొప్ప నివాళి అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ డూడుల్ వైరల్‌గా మారింది. 'తేరే మేరే బీచ్ మే' పాటను 1981లో కమల్ హాసన్ హిందీ చిత్రం ఏక్ దూజే కె లియే కోసం బాల సుబ్రహ్మణ్యం, లతా మంగేష్కర్ కలిసి పాడారు.
 
కాగా, గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం(74) కరోనా బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం (సెప్టెంబర్ 25) మధ్యాహ్నం ఒంటిగంటకు కన్నుమూసిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళ మెదడులో 2 సూదులు.. ఎలా చొచ్చుకెళ్లాయో తెలియదు..