Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శీతాకాలంలో మృదువైన చర్మం కోసం...

శీతాకాలంలో మృదువైన చర్మం కోసం...
, శుక్రవారం, 28 డిశెంబరు 2018 (21:54 IST)
ముఖం అందంగా ఉండాలని రకరకాల క్రీంలు వాడుతుంటారు. అవి వాడటం వల్ల చర్మం పాడైపోతుంది. అలాకాకుండా ఎంతో సులభంగా తక్కువ ఖర్చుతో ఇంటి చిట్కాలు పాటించి అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. కొన్ని చిట్కాలతో మృదువైన చర్మం మీ సొంతం చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
 
1. మృదువైన చర్మం కోసం అరచెక్క నిమ్మరసాన్ని ఒక గుడ్డు తెల్లసొనలో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని పది నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగివేయాలి. ఇలా వారానికి ఒకటి రెండుసార్లు చేయాలి.
 
2. ప్రతి రోజు కీరదోసకాయ ఫేస్ మాస్క్ వేసుకుంటే మెుటిమలు, బ్లాక్ హెడ్స్, ముడతలు, పొడిచర్మం వంటి సమస్యలు మీ దరిచేరవు. అదెలాగంటే... రెండు టేబుల్ స్పూన్ల ఓట్ మీల్ సగం ముక్క కీరదోసకాయ గుజ్జు, కొంచెం పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాలకు రాసుకొని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి.
 
3. కీరదోసకాయను క్లెన్సర్‌గా కూడా వాడవచ్చు. కీరదోసకాయ రసంలో కొన్ని పాలు కలిపితే క్లెన్సర్ అవుతుంది.
 
4. తేనెని గోరువెచ్చగా వేడిచేసి కళ్ల చుట్టూ వదిలి ముఖానికి రాస్తే ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే ముఖం మీద మచ్చలు, ముడతలు పోతాయి.
 
5. చర్మం పొడిగా ఉన్నవారు అర టీ స్పూన్ రోజ్ వాటర్‌లో ఒక టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి రాయాలి. పదిహేను, ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా చేస్తే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది.
 
6. బొప్పాయి రసాన్ని క్రమంతప్పకుండా ముఖానికి రాసుకుంటుంటే సూర్యకాంతి వల్ల చర్మంపై ఏర్పడ్డ గోధుమరంగు మచ్చలు తగ్గిపోతాయి. చర్మం మెరిసి పోవాలంటే బొప్పాయి గుజ్జులో కొంచెం నిమ్మరసం కలిపి వాడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శీతాకాలంలో నడక ఎంతో ముఖ్యం... ఎందుకో తెలుసా?