Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పసుపు, కరివేపాకు మెత్తగా రుబ్బి అలా పూసుకుంటే...

పసుపు, కరివేపాకు మెత్తగా రుబ్బి అలా పూసుకుంటే...
, గురువారం, 10 మార్చి 2022 (23:32 IST)
శరీరంపై మచ్చలు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ మచ్చలు పోగొట్టడంలో ఔషధంగా పనిచేస్తుంది నిమ్మకాయ. ఒక నిమ్మకాయ నుంచి రసాన్ని పిండుకుని దూదితో మొటిమలు, మచ్చలపై రాస్తే ముఖంలోని పింపుల్ మార్క్స్ మాయమవుతాయి. ప్రతిరోజూ ఐదు నిమిషాల పాటు నిమ్మరసాన్ని అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుందని బ్యూటీషియన్లు అంటున్నారు. 

 
శరీర చర్మంపై ఏర్పడే చికెన్ పాక్స్ మచ్చలు పోవాలంటే కూడా నిమ్మరసంతో ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే మంచిదని వారు చెబుతున్నారు. మచ్చలు పోయేందుకు పసుపు, కరివేపాకును మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీరంలోని చికెన్ ఫాక్స్ మచ్చలపై రాసి 15 నిమిషాల తర్వాత కడిగిస్తే మంచి ఫలితం ఉంటుంది. 

 
పింపుల్స్ పూర్తిగా తొలగిపోవాలంటే నిమ్మరసాన్ని దూదితో అప్లై చేసి అరగంట తర్వాత కడిగేయండి. మీ చర్మం మిలమిల మెరిసిపోతుంది. కొద్ది రోజులు ఇలా చేస్తే పింపుల్స్ ఉండవని బ్యూటీషియన్లు అంటున్నారు.  బొప్పాయి చెట్టు నుంచి వచ్చే పాలను కాసింత తీసుకుని అందులో నీటిని చేర్చండి. ఈ బొప్పాయి పాలు, నీటి మిశ్రమంలో నానబెట్టిన జీలకర్రను కలపండి. 15 నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే ముఖంలోని మచ్చలు తగ్గుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంతర్జాతీయ మూత్ర పిండాల దినోత్సవం: మూత్రపిండాల సంబంధిత వ్యాధుల పట్ల మణిపాల్‌ హాస్పిటల్‌ అవగాహన కార్యక్రమం