Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీటిలో క్యాబేజీ ముక్కలు వేసి..?

నీటిలో క్యాబేజీ ముక్కలు వేసి..?
, శనివారం, 16 మార్చి 2019 (15:50 IST)
మండే ఎండల్లో చర్మ సంరక్షణకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఎండలో చర్మం కమిలినట్లయితే ముఖ్యంగా పొడిచర్మం కలిగినవారు పంచదార, నిమ్మరసం, గ్లిజరిన్ కలిపి మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని మసాజ్ చేసుకోవాలి. ఇలా తరచు చేస్తుంటే చర్మ తాజాగా తయారవుతుంది. 
 
స్పూన్ బంగాళాదుంప రసం, స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు అప్లై చేసుకుని పావుగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. రోజూ ఇలా చేస్తూనే ఉండాలి. అప్పుడే.. వేసవికాలంలో వచ్చే చర్మ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
కీరా రసంలో స్పూన్ చల్లని పాలు కలిపి ముఖచర్మానికి రాసి పావుగంట ఆగిన తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు రాయాలి. మూడు టేబుల్ స్పూన్ల పాలు, స్పూన్ పసుపు కలిపి ముఖానికి పట్టించి, కొద్దిసేపాగి కడుక్కుంటే ఫలితం ఉంటుంది. 
 
కొద్దిగా అలోవేరా ఆకులు తీసుకుని నలిపి, నిమ్మరసం కలిపి పేస్ట్ మాదిరి చేసి ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా మారి మెరిసిపోతుంది. ఆలివ్ ఆయిల్ మసాజ్ వలన కూడా ఫలితం కనిపిస్తుంది. రెండు స్పూన్ల తేనె, నిమ్మరసం కలిపి కమిలిన చర్మంపై రాయాలి. దాంతో చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
 
నీటిలో క్యాబేజీ ముక్కలు వేసి కాచి, నీటిని వడగట్టి, ముక్కల్ని గుజ్జులా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాలు ఆగిన తర్వాత కడిగి వేయాలి. ఇలా వారం రోజులు చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిల్లలు ఉన్నట్టుండి ఏడుస్తున్నారా.. అయితే ఇలా చేయిండి..?