కళ్లు మిలమిలా మెరిసిపోవాలంటే?
బంగాళాదుంపను రుచికరైన వంటలకే కాదు సౌందర్య సాధనంగా వాడుకోవచ్చు. కంప్యూటర్ స్క్రీన్ ముందు గంటలతరబడి పని చేయటం ద్వారా కళ్లు అలసిపోతే.. నిద్రలేమి తప్పదు. దీంతో నల్లటి వలయాలు కూడా ఏర్పడుతాయి.
Publish Date: Sat, 05 May 2018 (12:34 IST)
Updated Date: Sat, 05 May 2018 (12:36 IST)
బంగాళాదుంపను రుచికరైన వంటలకే కాదు సౌందర్య సాధనంగా వాడుకోవచ్చు. కంప్యూటర్ స్క్రీన్ ముందు గంటలతరబడి పని చేయటం ద్వారా కళ్లు అలసిపోతే.. నిద్రలేమి తప్పదు. దీంతో నల్లటి వలయాలు కూడా ఏర్పడుతాయి.
వీటిని తొలగించాలంటే.. కళ్లు ఆకర్షణీయంగా మారాలంటే.. ఈ టిప్స్ పాటించాలి. బంగాళా దుంపలు, కీర ముక్కలను గుండ్రంగా కట్ చేసి.. కంట వలయాలపై పది నుంచి 15 నిమిషాల పాటు వుంచితే మంచి ఫలితం వుంటుంది.
అలాగే..
ముందుగా కొబ్బరి కోరుతో కోరి, మస్లిన్ క్లాత్ మీద పరచండి.
ఆపై వెనక్కి వాలి పడుకుని, కళ్లు మూసుకుని, ఈ క్లాత్ను కనురెప్పల మీద ఉంచాలి.
15 నిమిషాల తర్వాత క్లాత్ తొలగించి కళ్లు కడిగేసుకోవాలి.
ఇలా చేస్తే కళ్ల వాపు తొలగటంతోపాటు, కళ్ల కింద డార్క్ సర్కిల్స్ పోతాయి. ఇంకా కంటి అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది.