Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవకాడో మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే?

గంధపు పొడిలో తేనెను కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం మృదువుగా మారుతుంది. ఈ మిశ్రమాన్ని మె

Advertiesment
అవకాడో మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే?
, మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (12:02 IST)
గంధపు పొడిలో తేనెను కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం మృదువుగా మారుతుంది. ఈ మిశ్రమాన్ని మెడకు రాసుకుంటే కూడా నల్లటి వలయాలు తొలగిపోతాయి.
 
అవకాడోని పేస్ట్‌లా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం ముడతలు తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది. గులాబీ ఆకులు పొడిచేసుకుని అందులో కొద్దిగా బాదం నూనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం అందంగా, తెల్లగా మారుతుంది. 
 
దానిమ్మ గింజలను పేస్ట్‌లా చేసుకుని అందులో కొద్దిగా కీరదోస మిశ్రమాన్ని కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖంపై మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోయి కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి చూర్ణాలతో పురుషులకు ఆ పవర్...