బియ్యం పిండిలో పాలు కలుపుకుని ముఖానికి రాసుకుంటే?
						
		
						
				
బియ్యం పిండిలో కొద్దిగా పాలు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం ముడతలు తొలగిపోయి మృదువుగా మారుతుంది. బ్రెడ్ ముక్కలను పొడిచేసుకుని
			
		          
	  
	
		
										
								
																	బియ్యం పిండిలో కొద్దిగా పాలు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం ముడతలు తొలగిపోయి మృదువుగా మారుతుంది. బ్రెడ్ ముక్కలను పొడిచేసుకుని అందులో కొద్దిగా మీగడను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి.
	
 
									
										
								
																	
	 
	20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖచర్మం కాంతివంతంగా తెల్లగా మారుతుంది. పాలపొడిలో నిమ్మరసం, తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై గల నల్లటి మచ్చలు, మెుటిమలు తొలగిపోతాయి. తద్వారా ముఖం తాజాగా మారుతుంది.
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	పాలలో కొద్దిగా నిమ్మరసం, తేనె, పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది. బంగాళాదుంప రసంలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం అలసటను తొలగిపోయి తాజాగా మారుతుంది.