Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైతుకు వజ్రం దొరికింది, వేలం వేస్తే రూ.60 లక్షలు పలికింది : ప్రెస్ రివ్యూ

రైతుకు వజ్రం దొరికింది, వేలం వేస్తే రూ.60 లక్షలు పలికింది : ప్రెస్ రివ్యూ
, బుధవారం, 16 డిశెంబరు 2020 (15:39 IST)
వజ్రం దొరకడంతో మధ్యప్రదేశ్‌లో ఒక రైతు లక్షాధికారి అయ్యారని నమస్తే తెలంగాణ దినపత్రిక ఒక కథనం ప్రచురించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ రైతు ఒక్కసారిగా లక్షాధికారి అయ్యారు. 14.90 క్యారెట్ల వజ్రం లభించడంతో ఆయన పంటపండింది.
 
మంగళవారం నిర్వహించిన వేలంలో ఈ వజ్రం రూ.60.60 లక్షలు పలికిందని నమస్తే తెలంగాణ రాసింది. పన్నా జిల్లాలోని కృష్ణ కల్యాణ్‌ పూర్‌కు చెందిన లక్ష్మణ్‌ యాదవ్‌ అనే రైతుకు గత నెలలో ఒక గనిలో ఈ వజ్రం లభించింది. వెనుకబడిన బుందేల్‌ఖండ్‌ ప్రాంతానికి చెందిన పన్నా జిల్లా వజ్రపు గనులకు ప్రసిద్ధి అని పత్రిక వివరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నై చిన్నారి అదుర్స్.. 58 నిమిషాల్లో 46 వంటలు.. కొత్త రికార్డ్