Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శనివారం తలంటు స్నానం.. చల్లనినీటిని వాడుతున్నారా?

శనివారం తలంటు స్నానం.. చల్లనినీటిని వాడుతున్నారా?
, శుక్రవారం, 2 డిశెంబరు 2022 (15:24 IST)
కొంతమంది దీపావళికి మాత్రమే తలంటు స్నానం చేస్తారు. అయితే వారానికి ఒకసారి శనివారం పూట నువ్వుల నూనెతో తలంటుకుని తలస్నానం చేయడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలెన్నో పొందవచ్చు. వారానికి ఒక్కసారి నువ్వుల నూనెతో తలస్నానం చేస్తే రోగాలు తగ్గి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. 
 
కొబ్బరి నూనె స్నానం జుట్టు కుదుళ్లకు పోషకాలను అందిస్తుంది. అలాగే శరీరంలోని అధిక వేడిని దూరం చేస్తుంది. పొడి చర్మం ఉన్నవారికి తలంటుకుని స్నానం చేయడం ఒక వరం. ఆ నూనెను శరీరమంతా రాసుకుంటే చెమట వల్ల ఏర్పడే మురికి తొలగిపోతాయి.
 
శరీరంలో వేడి తగ్గి మనసు ఉల్లాసాన్ని పొందుతుంది. కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల కళ్లు ఎర్రబడి ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి వారానికోసారి కొబ్బరి నూనె లేదా నువ్వులనూనెతో తలస్నానం చేయడం వల్ల దృష్టి, కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. తలంటు స్నానం అంటే తల నుంచి అరికాళ్ల వరకు నూనె రాయాలి. అరగంట సేపు ఎండలో ఉండి స్నానం చేయడం మంచి ఆరోగ్యాన్నిస్తుంది. 
 
అదేవిధంగా కొందరు నూనె రాసుకుని చల్లటి నీటితో స్నానం చేస్తుంటారు. దీని వల్ల జలుబు, ఫ్లూ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నూనె రాసుకున్నప్పుడల్లా వేడి నీళ్లతో తలస్నానం చేయాలి.
 
తలంటు స్నానం చేసేటప్పుడు షాంపూలు వాడకపోవడం మంచిది. ఇవి నూనె జిగురును తొలగించవు. కాబట్టి తలంటు స్నానం చేస్తే.. శీకాకాయ పొడి, శెనగపిండిని ఉపయోగించాలి.
 
నలంగు పిండిని శరీరానికి రాసుకుని స్నానం చేయవచ్చు. ఇలాంటి పౌడర్లను రాసుకుని స్నానం చేయడం వల్ల చర్మంలోని జిడ్డు, మురికి మొదలైనవి తొలగిపోయి చర్మం మెరిసిపోతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూనమ్ కౌర్‌కి ఫైబ్రోమైయాల్జియా వ్యాధి, లక్షణాలు ఏమిటి?