Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పచ్చి పసుపులో ఆవు పెరుగు కలిపి తీసుకుంటే?

పచ్చి పసుపులో ఆవు పెరుగు కలిపి తీసుకుంటే?
, సోమవారం, 28 జనవరి 2019 (10:06 IST)
ఆంధ్రుల సంస్కృతిలో, ఆచార వ్యవహారాల్లో పసుపుకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. పసుపు మంగళకరమైనది. మన రోజువారి ఆహారంలో పసుపు ఒక భాగంగా నిల్చిపోయింది. శుభకార్యాల్లో పసుపును కాళ్ళకు, ముఖానికి రాసుకోవడం మంగళప్రదంగా భావిస్తారు. మన ఆంధ్రదేశ్ వనితలు, దీనిని తెలుగులో పసుపు, సంస్కృతిలో హరిద్రా అని పిలుస్తారు. 
 
1. పసుపు, చందనం రెండింటిని పాలమీద మీగడతో కలిపి స్నానానికి అరగంట ముందు ముఖానికి రాసుకుని తరువాత చన్నీళ్ళతో శుభ్రంగా కడిగిన ముఖ వర్చస్సు పెరుగుతుంది. శరీర కాంతి ఇనుమడిస్తుంది.
 
2. పసుపు మరియు ఉసిరిక చూర్ణాన్ని సమపాలల్లో 2 గ్రాముల చొప్పున రోజు ఉదయం, సాయంత్రం సేవిస్తే మధుమేహం అదుపులో ఉంటుంది.
 
3. దాదాపు 10 గ్రాముల పచ్చి పసుపు 20-40 గ్రాముల ఆవు పెరుగు నందు కలిపి ఉదయం సేవించినచో కామెర్లు తగ్గుతాయి. ఆహారం కారం, పులుపు, మసాల వస్తువులు ఇవ్వకూడదు.
 
4. పసుపు, వేపచెక్క, పట్టచూర్ణం, కరక్కాయ చూర్ణాలను సమభాగాలుగా తీసుకుని 2 గ్రాముల చొప్పున వాడితే చర్మవ్యాధులు, క్రిమిరోగాలు నయమవుతాయి. 
 
5. పసుపు చూర్ణం, వేపాకు చిగుళ్లు, దిరిసెన పట్టచూర్ణం సమాన భాగాలుగా తీసుకుని దీర్ఘకాలంగా ఉన్న ప్రణాలను శుభ్రంగా కడిగి పట్టువేస్తే వ్రణాలు తగ్గిపోతాయి. చర్మవ్యాధులు తగ్గుతాయి. 
 
6. పసుపు, తులసి ఆకుల రసం కలిపి పట్టువేస్తే దీర్ఘకాలిక వ్రణాలు మానిపోతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళలకు ఫ్రైడ్ చికెన్, చేపలను అస్సలు ఇవ్వొద్దు.. ఎందుకు?