Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీజేపీ బాట‌లో.... మంద కృష్ణ మాదిగ‌కు షర్మిల ప‌రామ‌ర్శ‌

Advertiesment
ysrtp
విజయవాడ , బుధవారం, 8 సెప్టెంబరు 2021 (12:33 IST)
కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిష‌న్ రెడ్డి మంద కృష్ణ మాదిగ‌కు అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తూ, ఆయ‌న్ని ఆసుప‌త్రిలో ప‌రామ‌ర్శించ‌డం, ఉప రాష్ట్ర‌ప‌తి వ‌ద్ద‌కు తీసుకెళ్ళ‌డం చేశారు. ఇపుడు అదే బాట‌లో 
తెలంగాణ పార్టీ అధినాయ‌కురాలు వైయ‌స్ ష‌ర్మిల ప‌య‌నిస్తున్నారు. హైద‌రాబాదులోని విద్యానగర్ లోని ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ  నివాసానికి వెళ్లి ప‌రామ‌ర్శించారు.
 
మంద‌కృష్ణ మాదిగకి ఇటీవ‌ల ఢిల్లీలో శ‌స్త్రచికిత్స జ‌ర‌గ‌గా, ఆయ‌న‌ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మందకృష్ణ మాదిగ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. 
 
అనంత‌రం సెప్టెంబ‌ర్‌ 12వ తేదీన ఆదివారం న‌ల్ల‌గొండ జిల్లా తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గం తిరుమ‌ల‌గిరి ప‌ట్ట‌ణంలో వై.ఎస్.ఆర్. తెలంగాణ పార్టీ నిర్వ‌హించ‌బోయే "ద‌ళిత భేరి" బ‌హిరంగ స‌భ‌కు ఆహ్వానించారు. ద‌ళితుల ప‌క్షాన పోరాటానికి  మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని మంద‌కృష్ణ మాదిగని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షరియా చట్టాల అమలులో వెనక్కి తగ్గేదే లేదు : తేల్చి చెప్పిన తాలిబన్లు