Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీని వదిలేసి తెలంగాణాకు వచ్చేస్తా : జేసీ దివాకర్ రెడ్డి

Advertiesment
ఏపీని వదిలేసి తెలంగాణాకు వచ్చేస్తా : జేసీ దివాకర్ రెడ్డి
, శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (15:27 IST)
ఏపీకి చెందిన టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
సీఎల్పీలో పాత్ర మిత్రులందరినీ కలిశానన్నారు. ప్రస్తుతం రాజకీయాలే కాక, సమాజం కూడా బాగోలేదని అన్నారు. అయితే ఏపీ కంటే తెలంగాణ రాజకీయాలే బాగున్నాయన్నారు. 
 
ఇక తాను తెలంగాణను వదిలిపెట్టి చాలా నష్టపోయానని... ఏపీని వదిలేసి తాను తెలంగాణకు వస్తానని చెప్పారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసని అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక గురించి తనకు పూర్తిగా తెలియదని చెప్పారు. 
 
కాగా, జేసీ దివాకర్ రెడ్డి ఏపీ రాజకీయాలపై స్పందించారు. గతంలో ఏపీ సీఎం జగన్ మావోడు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాకుండా జగన్ పాలనపై కూడా విమర్శలు చేశారు. ఆ తర్వాత ఆయనకు ఏపీ ప్రభుత్వం నుంచి అనేక చిక్కులు ఉత్పన్నమైన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త చనిపోయాడు, మరొకడితో పెళ్లంటే వద్దన్న పెద్దలు, అంతే కత్తి తీసుకుని...