Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జిల్లా కలెక్టర్లతో ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్

జిల్లా కలెక్టర్లతో ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్
, మంగళవారం, 5 మే 2020 (21:35 IST)
కరోనా నియంత్రణ చర్యలపై మంగళవారం రాత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు.కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ జిల్లాలో 4వ విడత సర్వేలైన్స్ సర్వే 96.28 శాతం పూర్తి అయ్యిందని వివరించారు.

అందులో 3922 మందిని కరోనా సాధారణ అనుమా నుతులుగా గుర్తించామని,వీరికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

కరోనా బాధితులకు వైద్యం అందిoచేందుకు ఏర్పాటు చేసిన కోవిడ్ హాస్పిటల్స్ అవసరమైన అన్ని చర్యలు ఎప్పటికప్పుడు ముందుగానే గుర్తించి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

జిల్లాలో కరోనా పరీక్షలు నిర్వాహణలో పెండింగులో లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.ఇంతవరకు 15,148 పరీక్షలు నిర్వహించామని,మిగిలినవి పెండింగులో లేకుండా త్వరితగతిన పూర్తి చేస్తామని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. మాధవిలత కూడా పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేపు వైయస్సార్‌ మత్స్యకార భరోసా పధకం చెల్లింపులు