Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జూనియర్ ఎన్టీఆర్‌తో ఆ నేతలు చర్చలు.. ఎందుకంటే?

జూనియర్ ఎన్టీఆర్‌తో ఆ నేతలు చర్చలు.. ఎందుకంటే?
, శుక్రవారం, 22 నవంబరు 2019 (19:28 IST)
వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ నేతలపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయంటూ ప్రతిపక్ష నేతలు గగ్గోలు పెడుతున్నారు. దీనికితోడు టిడిపి నుంచి వైసిపిలోకి వెళ్ళే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉన్నదే 23 మంది టిడిపి ఎమ్మెల్యేలు. అందులో ఇప్పటికే వల్లభనేని వంశీ బయటకు వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది వైసిపితో టచ్‌లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.
 
దీంతోపాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు బిజెపితో టచ్‌లో ఉన్నారన్న ప్రచారం బాగానే జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో వల్లభనేని వంశీ, కొడాలి నానిల వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. అయితే టిడిపి పార్టీ ఘోరంగా విఫలమవ్వడానికి నారా లోకేష్ కారణమంటూ వల్లభనేని వంశీనే స్పష్టం చేశారు.
 
ఇలాంటి పరిస్థితుల్లో వల్లభనేని వంశీ, జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారట. కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఇద్దరూ జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితులు. జూనియర్ ఎన్టీఆర్ గతంలో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసినప్పుడు వీరు సంతోష పడ్డారు. ముఖ్యంగా వల్లభనేని వంశీ అయితే జూనియర్ ఎన్టీఆర్‌కు స్క్రిప్ట్ కూడా అందించారు.
 
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం మంచిదన్న అభిప్రాయంలో ఉన్నారట వల్లభనేని. ఆయన్ను తిరిగి రాజకీయాల్లోకి రావాలని వల్లభనేని ఫోన్ ద్వారా జూనియర్‌తో మాట్లాడారట. ప్రస్తుతం అవసరపడి రాజకీయాల్లోకి రాకూడదని.. సినిమాల్లో బిజీగా ఉన్నాను తప్ప రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడనని వంశీకి సున్నితంగా జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేప‌టి నుండి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు