Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి, పవన్ కల్యాణ్ పేరుతో పార్కు.. ఏర్పడిన వివాదం.. ఘర్షణ

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ల పేర్లు పార్కు వివాదంతో చిక్కుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉరదాళ్లపాలెంలో ప్రభుత్వ స్థలంలో పార్కు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఆ పార్

Advertiesment
Two Groups
, శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (12:57 IST)
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ల పేర్లు పార్కు వివాదంతో చిక్కుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉరదాళ్లపాలెంలో ప్రభుత్వ స్థలంలో పార్కు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఆ పార్కుకు ''చిరంజీవి-పవన్ కల్యాణ్'' అనే పేరు పెట్టాలని ఒక వర్గం పట్టుబడితే.. మరోవర్గం కుదరదని తేల్చి చెప్పేసింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. 
 
ఈ ఘర్షణ చివరికీ దాడులు చేసేంతవరకు వెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలైనాయి. గాయపడిన వారిని చికిత్స కోసం తణుకు ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో, పరిస్థితులు చేజారకుండా ఉండేందుకు గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. 
 
ప్రస్తుతం ఉరదాళ్లపాలెంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ స్థలంపై ఇరు వర్గాలు తమదంటే తమదేనంటూ పోటీపడటంతోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుందని పోలీసులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దసరా వేళ.. ముంబైలో విషాదం.. ఎల్ఫిన్ స్టోన్ స్టేషన్ వద్ద తొక్కిసలాట.. 15 మంది మృతి