Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్ల రిలీజ్

నేడు శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్ల రిలీజ్
, ఆదివారం, 20 మార్చి 2022 (13:08 IST)
కోవిడ్ మహమ్మారి కారణంగా గత 2020 మార్చి నుంచి నిలిపివేసిన శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లను ఆదివారం నుంచి ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ఏప్రిల్, మే, జూన్ నెలకుగాను ఆర్జిత సేవా టిక్కెట్లను తితిదే విడుదల చేయనుంది. 
 
ఇందులో సుప్రభాతం, తోమాల, అర్జన, అష్టదశ పాదపద్మారాధన, నిజపాద దర్శనం తదితర ఆర్జిత సేవా టిక్కెట్లు ఎలక్ట్రానిక్ లాటరీ పద్దతి ద్వారా భక్తులకు కేటాయిస్తారు. 
 
ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు రెండు రజుల పాటు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విడుదల చేస్తారు. టిక్కెట్లు పొందిన వారి జాబితాను ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటల తర్వాత తితిదే వెబ్‌సైట్‌లో వెల్లడిస్తుంది. అదేవిధంగా భక్తులకు ఎస్ఎంఎస్ ద్వారా, మెయిల్ ద్వారా సమాచారం చేరవేస్తుంది. టిక్కెట్లు పొందిన భక్తులు రెండు రోజుల్లో సేవల చార్జీలకు సంబంధించిన రుసుంను చెల్లించాల్సి ఉంటుంది.
 
ఆర్జిత సేవా టిక్కెట్ల కోసం భక్తులు తితిదే అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇక కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవకు సంబంధించిన టిక్కెట్లను భక్తులు నేరుగా బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. అయితే, ప్రత్యేక రోజుల్లో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. 
 
ఏప్రిల్ 2వ తేదీన ఉగాది పురస్కరించుకుని కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఏప్రిల్ 10న శ్రీరామనవమి రోజున తోమాల, అర్చన, సహస్రదీపాలంకరణ సేవలు, ఏప్రిల్ 14 నుంచి 16 వరకూ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు, ఏప్రిల్ 15న నిజపాద దర్శనం సేవల్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. 
 
ఇక తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు కొవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ లేదా రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి అని టీటీడీ తెలిపింది. భక్తుల ఆరోగ్యం, టీటీడీ ఉద్యగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని నిబంధనలకు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో స్థిరంగా చమురు ధరలు - తెలుగు రాష్ట్రాల్లో హెచ్చుతగ్గులు