Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తండ్రితో పొలానికి వెళ్లిన మూడేళ్ల చిన్నారి.. సజీవ దహనమైంది.. ఎలా?

తండ్రితో పొలానికి వెళ్లిన మూడేళ్ల చిన్నారి.. సజీవ దహనమైంది.. ఎలా?
, గురువారం, 24 డిశెంబరు 2020 (13:21 IST)
తండ్రితో పొలం వెళ్లిన కూతురు కారులో ఆడుకుంటుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సజీవ దహనమైన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఇలా మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ సజీవ దహనమైన విషాద ఘటనతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా, క్రోసూరు మండలం బయ్యవరంకు చెందిన కడియం మణికంఠ తన మూడేళ్ల కూతురు శ్రీనిధిని బొలెరో ట్రక్కు వాహనంలో ఎక్కించుకుని పొలం తీసుకెళ్లాడు. చిన్నారిని వాహనంలోనే కూర్చోబెట్టి తండ్రి వరిపొలంలో పంట నూర్పిడి పనులు చేసుకుంటున్నాడు.
 
హఠాత్తుగా కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది. వాహనంలోనే ఆడుకుంటున్న చిన్నారి తీవ్రగాయాలపాలవడంతో వెంటనే ఆమెను గుంటూరు జిజిహెచ్‌కు తరలించారు. అప్పటికే శరీరం పూర్తిగా కాలిపోవడంతో ఆ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆత్మీయులారా, అతిథులారా నా కుమార్తె వివాహానికి రావద్దు ప్లీజ్: చింతమనేని స్వీట్ ఇన్విటేషన్