Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ముగ్గురి మృతి

car accident
, బుధవారం, 27 జులై 2022 (09:14 IST)
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు ఔటర్ రింగ్ రోడ్డు సమీపలోని జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఓ కారును లారీ ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అమిత వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జు అయింది. 
 
స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని రాయదుర్గానికి చెందిన గణేశ్, రుద్ర, సోమశేఖర్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో మరో మంకీపాక్స్ కేసు గుర్తింపు