Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీఆర్డీయే బిల్లు కమిటీ ఛైర్మన్‌గా బొత్స - వికేంద్రీకరణ కమిటీ బిల్లు పెద్దగా మంత్రి బుగ్గన

సీఆర్డీయే బిల్లు కమిటీ ఛైర్మన్‌గా బొత్స - వికేంద్రీకరణ కమిటీ బిల్లు పెద్దగా మంత్రి బుగ్గన
, గురువారం, 6 ఫిబ్రవరి 2020 (15:00 IST)
పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపుతూ ఏపీ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు బిల్లులకు వేర్వేరుగా రెండు కమిటీలను మండలి ఛైర్మన్ ఏర్పాటు చేశారు. వీటిలో సీఆర్డీయే బిల్లు రద్దు కమిటీ ఛైర్మన్‌గా మంత్రి బొత్సన సత్యనారాయణను నియమించారు. అలాగే, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు కమిటీ పెద్దగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని నియమిస్తూ మండలి ఛైర్మన్ ఆదేశాలు జారీచేశారు. 
 
కాగా, సీఆర్డీఏ రద్దు బిల్లు సెలెక్ట్ కమిటీలో సభ్యులుగా తెలుగుదేశం పార్టీ నుంచి దీపక్ రెడ్డి, బచ్చుల అర్జునుడు, రవిచంద్ర, శ్రీనివాసులు, వైసీపీ నుంచి మహ్మద్ ఇక్బాల్, బీజేపీ నుంచి సోము వీర్రాజు, పీడీఎఫ్ నుంచి వెంకటేశ్వరరావు ఉంటారు. 
 
అలాగే, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించిన సెలెక్ట్ కమిటీ ఛైర్మన్‌గా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సభ్యులుగా తెదేపా నుంచి నారా లోకేశ్, తిప్పేస్వామి, అశోక్ బాబు, సంధ్యారాణి, బీజేపీ నుంచి మాధవ్, వేణుగోపాల్ రెడ్డి, పీడీఎఫ్ నుంచి లక్ష్మణరావు ఉన్నారు.
 
వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించిన సెలెక్ట్ కమిటీ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని తాము భాగస్వామ్యం కాబోమంటూ మండలి ఛైర్మన్ షరీఫ్‌కు  వైసీపీ నేతలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఉమ్మారెడ్డి లేఖ రాసిన విషయం తెల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకే కుటుంబంలో ఐదుగురి కరోనా వైరస్