Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా అల్లుడిని చంపేశానంటూ లొంగిపోయిన మామ.. ఖాకీలు ఇంటికి రాగానే...

తమ అల్లుడిని చంపేశానంటూ ఓ మామ పోలీసులకు లొంగిపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి శవం కోసం ఇంటికి వచ్చారు. అయితే, అల్లుడు తాపీగా కూర్చొని చెకోడీలు తింటూ కనిపించడంతో పోలీసులు షాక్‌కు గురైయ్యారు. ఈ ఘట

Advertiesment
Telangana
, గురువారం, 9 ఆగస్టు 2018 (10:36 IST)
తమ అల్లుడిని చంపేశానంటూ ఓ మామ పోలీసులకు లొంగిపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి శవం కోసం ఇంటికి వచ్చారు. అయితే, అల్లుడు తాపీగా కూర్చొని చెకోడీలు తింటూ కనిపించడంతో పోలీసులు షాక్‌కు గురైయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కొత్తనారంవారిగూడేనికి చెందిన గురింద నాగులు అనే వ్యక్తి అల్లుడు రాజు. నిత్యం తాగొచ్చి నానా యాగీ చేస్తుంటాడు. బుధవారం ఉదయం కూడా మద్యం మత్తులో వచ్చి మామతోపాటు భార్యను వేధించాడు. అల్లుడి గోల భరించలేని మామ.. లాగి పెట్టి చెంపమీద కొట్టాడు. 
 
ఆ దెబ్బతో దిమ్మదిరిగిన రాజు గింగరాలు తిరుగుతూ కింద పడిపోయాడు. నోట మాటలేదు. దీంతో చనిపోయాడని భావించిన మామ నాగులు నేరుగా స్థానిక పోలీస్ ఠాణాకు వెళ్లి.. మా అల్లుడుని చంపేశా.. కేసు నమోదు చేసి అరెస్టు చేయండి అంటూ లొంగిపోయాడు. 
 
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... సంఘటనాస్థలానికి వెళ్లారు. అక్కడ అల్లుడు రాజు చక్కగా లేచి కూర్కొని చెకోడీలు తింటూ కనిపించాడు. పైగా, స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడుతో వైద్యం కూడా చేయించుకున్నాడు. మామ చేసిన పోలీసులతో పాటు స్థానికులు కూడా విస్తుపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హోం వర్క్ చేయలేదనీ.. కంటిలో పెన్నుతో గుచ్చిన టీచర్.. ఎక్కడ?