Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలికపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్.. హత్యాచారం జరిగిందా?

Advertiesment
Telangana
, శుక్రవారం, 24 జనవరి 2020 (11:23 IST)
తెలంగాణలో ఓ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. 17 ఏళ్ల బాలిక రెండు అపార్ట్‌మెంట్ల మధ్య శవమై కనిపించింది. ఎవరో ఆమెను అత్యాచారం చేసి... అపార్ట్‌మెంట్‌పై నుంచీ కిందకు విసిరేసినట్లుగా అనుమానిస్తున్నారు. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరుగుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. మరోవైపు సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ పీఎస్ పరిధిలో 16 సంవత్సరాల మైనర్ బాలికపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన వెలుగు చూసింది. స్థానిక చక్రపురి కాలనీలో బాలికను ఓ షాప్ వద్ద బలవంతంగా కారులోకి ఎక్కించి కిడ్నాప్ చేసి, ఆమెను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి మద్యం తాగి దుండగులు అత్యాచారం చేసినట్లు తెలిసింది. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. 
 
తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించగా, సెల్‌ఫోన్ ఆధారంగా బాలిక ఆచూకీని పసిగట్టి, ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైల్వే టీసీ కోటిన్నర ఫైన్ వసూలు