Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైఎస్ విజయమ్మ ఇపుడు ఎటువైపు ఉంటారో? బీటెక్ రెవి ప్రశ్న

btechravi

ఠాగూర్

, బుధవారం, 3 ఏప్రియల్ 2024 (20:07 IST)
ఇడుపులపాయలో మాజీ మంత్రి దివంగత వివేకానంద రెడ్డి మృతిపై ఏపీ పీసీసీ చీఫ్ వైస్ షర్మిల చేసిన వ్యాఖ్యలో వాస్తవం ఉందని టీడీపీ నేత బీటెక్ రవి సందేహం వ్యక్తం చేశారు. వివేకాను చంపితే ఎవరికి లాభం.. మొటివ్ ఏంటి అని సజ్జల అన్నారు ఆ మొటివ్ ఏంటో నిన్న షర్మిల చెప్పారని ఆయన గుర్తు చేశారు. 
 
సీఎం జగన్ ప్రతిసారి సీట్ల కేటాయింపుల దగ్గర నుంచి మ్యానిఫెస్టో విడుదల వరకు తన తండ్రి సమాధి దగ్గర నుంచే ఏ కార్యక్రమం అయిన మొదలుపెడతా ఉంటాడని కదా మరి మీ తండ్రి అత్మసాక్షిగా నీలో మీ అబ్బ రాజారెడ్డి, మీ తండ్రి వైస్సార్ రక్తమే నీలో ప్రవహిస్తా ఉంటే వైస్సార్ బిడ్డ అయినటువంటి వైస్ షర్మిల మీద వివేకానంద రెడ్డి హత్య కేసులో వైస్ షర్మిల అన్నట్లు వివేకా హత్య కేసులో హంతకుడు అయినటువంటి ఎంపీ అవినాష్‌ని పోటీనే పెట్టకూడదన్నారు. 
 
సిగ్గుశరం ఉంటే కడప పార్లమెంట్ నుంచి అవినాష్ రెడ్డి స్వచ్చందంగా తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైస్.విజయమ్మ ఎటు వైపు ఉంటుందో తేల్చుకోవాలి కొడుకు కోడలు చెప్పినట్లు అవినాష్ వైపు ఉంటుందా లేక వైస్ షర్మిల వైపు ఉంటుందా అనే క్లారిటీ పులివెందుల ప్రజలకు వైస్ విజయమ్మ తెలియజేయాలని బీటెక్ రవి డిమాండ్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీ పేలుడులో ఆరుగురు మృతి: మృతుల్లో ఎండీ, మేనేజర్?