Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబు గాంధీ సిద్ధాంతాల వల్ల వైకాపా రెచ్చిపోతోంది : బుద్ధా వెంకన్నా

చంద్రబాబు గాంధీ సిద్ధాంతాల వల్ల వైకాపా రెచ్చిపోతోంది : బుద్ధా వెంకన్నా
, బుధవారం, 20 అక్టోబరు 2021 (11:27 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న గాంధీ సిద్ధాంతాల వల్లే అధికార వైకాపా శ్రేణులు రెచ్చిపోతున్నారని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్నా వ్యాఖ్యానించారు. ఏపీలోని టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతల ఇళ్ళపై వైకాపా శ్రేణులు దాడులకు తెగబడిన విషయం తెల్సిందే. 
 
దీనిపై బుద్ధా వెంకన్న స్పందిస్తూ, తెదేపా హయాంలో పోలీసు వ్యవస్థకు ఎంతో గౌరవం ఉండేదన్నరు. ఇప్పుడు మాకు పోలీసుల‌పై నమ్మకం లేద, మాకు మేమే రక్షణగా.. నిలబడి.. వైసిపి రౌడీ మూకలను అడ్డుకుని తీరతామన్నారు. 
 
చంద్రబాబు గాంధీజీ సిద్దాంతాల వల్ల వైసిపి వాళ్లు రెచ్చిపోతున్నారంటూ ఆరోపించారు. చంద్రబాబు ఫోన్ చేస్తే డిజిపికి స్పందించాల్సిన బాధ్యత లేదా అంటూ నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ దాడులు జరిగాయి అని ఆరోపించారు. ఏపీలో ఆర్ధిక ఎమర్జెన్సీ నెలకొందనీ, దీని నుంచి దృష్టి మరల్చడానికే ఇలా దాడులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్నేక్‌ కేక్‌ గురించి ఎప్పుడైన విన్నారా? (video)