Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేమ పేరుతో లొంగదీసుకుని.. బెదిరించి అక్కాచెల్లెళ్లపై అత్యాచారం

ప్రేమ పేరుతో లొంగదీసుకుని.. బెదిరించి అక్కాచెల్లెళ్లపై అత్యాచారం
, ఆదివారం, 17 జనవరి 2021 (15:42 IST)
ప్రేమ పేరుతో లొంగదీసుకుని అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలకు వలవేసి వారిని ప్రేమలోకి దింపి వారిపై అత్యాచారం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. సుర్యాపేటలో ఒంటరి తల్లితో నివసిస్తున్న ఇద్దరు అక్కచెల్లెళ్ళలో పెద్ద కుమార్తె (17)కి మునగాలకు చెందిన చింతకాయల ఉదయ్ మూడేళ్ల క్రితం ఇన్ స్టాగ్రాం ద్వారా పరిచయమయ్యాడు. 
 
ఉదయ్ కొంతకాలం కోదాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పని చేసి, ఇటీవలే సూర్యాపేటలోని మరో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. ఇన్ స్టా గ్రాంలో పరిచయమైన 17 ఏళ్ల బాలికను ప్రేమించాలని, పెళ్లి చేసుకుంటానని లేకపోతే చచ్చిపోతానని బెదిరించి ఆమెను లొంగదీసుకున్నాడు.
 
బాలికను పట్టణంలోని తన స్నేహితుడి రూమ్‌కు తీసుకు వెళ్లి పలుమార్లు అత్యాచారం చేసినట్లు బాలిక పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపింది. ఆమెను బెదిరించి రూ. 2లక్షలు కూడా తీసుకున్నాడు. ఉదయ్ ద్వారానే ఆమె చెల్లెల్లు(15) ను సూర్యాపేట రాజీవ్ నగర్‌కు చెందిన బాలుడికి పరిచయం చేశాడు. ఇతనూ ఆమెను అదే గదికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు.
 
బైక్ కొనుక్కునేందుకు రూ. 50 వేలు బెదిరించి తీసుకున్నట్లు బాధితురాలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వీడు మాములోడు కాదు.. 22ఏళ్లలో 12 మందిని పెళ్లాడాడు.. చివరికి?