Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం.. భార్య గొంతు కోసి చంపేశాడు..

పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం.. భార్య గొంతు కోసి చంపేశాడు..
, శనివారం, 16 జనవరి 2021 (19:55 IST)
వివాహేతర సంబంధం కారణంగా నేరాల సంఖ్య పెరిగిపోతోంది. పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భర్త ఆమెను కిరాతకంగా హత్య చేసాడు. జనవరి 4వ తేదీన చావ్లా తేజ్ పూర్ రోడ్డు పక్కన ఉన్న పొదల్లో ఓమహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను గొంతుకోసి కిరాతకంగా హత్య చేసినట్లు గుర్తించారు. విచారణలో వాయువ్య ఢిల్లీలోని బల్జీత్ విహార్ ప్రాంతంలో ఓ మహిళ మిస్సింగ్ కేసు నమోదైనట్లు తెలుసుకున్నారు. 
 
అదృశ్యమైన మహిళ వివరాలు తమకు లభ్యమైన మహిళ మృతదేహం ఆనవాళ్లు సరిపోయినట్లు పోలీసులు గుర్తించారు. మిస్సింగ్ మహిళ గురించి ఫిర్యాదు చేసిన బల్జీత్ విహార్‌ని వ్యక్తి ఇంటికి వెళ్లారు. అక్కడ ఆమె కుమారుడు శివంను ఆస్పత్రికి తీసుకువెళ్లి తమకు దొరికిన మృతదేహాన్ని చూపించారు. ఆమె తన తల్లి సరస్వతిగా శివం చెప్పాడు. తల్లి శవం చూసి శివం భోరున విలపించాడు. అయితే భర్త సోహన్ కనిపించక పోవటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు అతడి గురించి గాలింపు చేపట్టారు. సోహన్ చౌరాసియా ను మంగళవారం నిహారీ రోడ్డులో అరెస్ట్ చేశారు. భార్యను తానే హత్య చేసినట్లు సోహన్ ఒప్పుకున్నాడు.
 
తమ ఇంట్లో రెండేళ్లుగా కలిసి జీవిస్తున్న చందన్ అనే వ్యక్తితో భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో హత్య చేసినట్లు అంగీకిరించాడు. భార్య మెడను ప్లాస్టిక్ తాడు బిగించి ఊపిరాడకుండా చేశానని.. ఆపై పదునైన కత్తితో మెడకోసి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని తేజ్ పూర్ చావ్లా రోడ్డు పక్కన పొదల్లో పడేసి పారిపోయినట్లు వివరించాడు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిఎం జగన్ ఏమిటీ అన్యాయం? టీకా మాది.. ప్రచారం మీదా.. మోడీ ఫోటో ఎక్కడ?