Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి దర్శనం పునఃప్రారంభం

శ్రీవారి దర్శనం పునఃప్రారంభం
, సోమవారం, 8 జూన్ 2020 (10:00 IST)
దాదాపు 80 రోజుల అనంతరం భక్తులకు శ్రీవారి దర్శనం ఈ ఉదయం లభించింది. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆలయ దర్శనాలను ప్రయోగాత్మకంగా ప్రారంభించగా, ఏళ్ల తరబడి స్వామివారి సేవలో తరిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు స్వామిని దర్శించుకున్నారు.
 
భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ లను ధరించిన ఉద్యోగులు, క్యూ లైన్లలో ఆలయంలోకి వెళ్లారు. కాగా, దర్శనాలు తిరిగి ప్రారంభమైన వేళ, స్వామివారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.

పూలు, పండ్లతో ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. భక్తులకు దర్శనాలు కల్పించేందుకు మార్కింగ్ లైన్స్, భౌతిక దూరాన్ని పాటిస్తూ, నిలబడేందుకు ప్రత్యేక బాక్స్ లు, ఎక్కడికక్కడ శానిటైజర్లు అమర్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆగస్టు 15 తర్వాతే విద్యాలయాలు పునఃప్రారంభం: స్పష్టత ఇచ్చిన కేంద్రం