Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దసరా పండుగ నాడు తెదేపాలోకి 'సూరీడు'?

సూరీడు.. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి నమ్మిన బంటు. చిన్నతనంలో వైఎస్ఆర్ వద్ద చేరిన సూరీడు ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరైపోయారు. తన కుమారుడు జగన్, కుమార్తె షర్మిళ, భార్య విజయమ్మలతో తక్కువ సేపు వైఎస్ఆర్ ఉండేవారు కానీ సూరీడు మాత్రం 24 గంటలూ ఆయన్నే అంటిపెట్టుకుని ఉం

దసరా పండుగ నాడు తెదేపాలోకి 'సూరీడు'?
, గురువారం, 14 సెప్టెంబరు 2017 (13:57 IST)
సూరీడు.. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి నమ్మిన బంటు. చిన్నతనంలో వైఎస్ఆర్ వద్ద చేరిన సూరీడు ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరైపోయారు. తన కుమారుడు జగన్, కుమార్తె షర్మిళ, భార్య విజయమ్మలతో తక్కువ సేపు వైఎస్ఆర్ ఉండేవారు కానీ సూరీడు మాత్రం 24 గంటలూ ఆయన్నే అంటిపెట్టుకుని ఉండేవారు. అలాంటి వ్యక్తి వైఎస్ఆర్ మరణం తరువాత కనిపించకుండా పోయారు. అంతేకాదు... వై.ఎస్. బతికున్న సమయంలో అంతోఇంతో ఆస్తులు చేర్చుకున్నట్లు ఆరోపణలు కూడా సూరీడుపై ఉన్నాయి.
 
అయితే అలాంటి సూరీడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళనున్నారు. ఆయన పార్టీలోకి వెళ్లడం దాదాపు ఖాయమైంది. వై.ఎస్.ఆర్ మరణం తరువాత కొంతమంది నేతలతో పడుతున్న ఇబ్బందులను ఎదుర్కోవడానికి సూరీడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీలో ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి సూరీడు ఆ పార్టీలో చేరాలనుకుంటున్నారట. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో నేరుగా చర్చలు జరిపిన సూరీడు దసరాకు ఆ పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వైఎస్ఆర్‌కు రాజకీయ శత్రువు చంద్రబాబు. అలాంటి వ్యక్తి చెంత సూరీడు చేరడం ఏమిటో ఇప్పటికే వైఎస్ఆర్ సన్నిహితులకు అర్థం కాని ప్రశ్నలా మారిపోయింది. కానీ సూరీడు మాత్రం కేవలం రాజకీయంగా కొంతమంది నుంచి ఎదురయ్యే ఇబ్బందులను తప్పించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో దారుణం : రైలు రాదని నమ్మించి పార్కుకు తీసుకెళ్లి రేప్ చేశాడు...