Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాట నిలబెట్టుకున్న సోనూసూద్ ... ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు

మాట నిలబెట్టుకున్న సోనూసూద్ ... ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు
, సోమవారం, 5 జులై 2021 (12:58 IST)
కరోనా కష్టకాలంలో ఎంతో మందికి ఆపద్బాంధవుడైన బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోమారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఏపీలోని నెల్లూరు జిల్లాకు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆత్మకూరు ఆస్పత్రి కోసం ఆక్సిజన్ ప్లాంట్ కొనుగోలు చేసి, రోడ్డు మార్గాన పంపించారు.
 
తన సొంత ఖర్చులతో ఆక్సిజన్ ప్లాంట్​ను కొనుగోలు చేసి నెల్లూరుకు పంపించారు. ఈ ప్లాంట్​ను ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంట్ ఇప్పటికే.. రోడ్డు మార్గాన బయలుదేరిందని, రెండు వేల కిలోమీటర్లు ప్రయాణించి వారం రోజుల్లో ఆత్మకూరుకు చేరుకుంటుందని సోనూసూద్ మిత్రులు తెలిపారు.
 
ఇప్పటికే దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆక్సిజన్​ ప్లాంట్లు పెట్టనున్నట్లు హామీ ఇచ్చారు. ఏపీలోని నెల్లూరు, కర్నూలు నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. త్వరలో తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్​లో సహా పలు రాష్ట్రాల్లో సోనూ, ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.
 
కరోనా సంక్షోభం ప్రారంభమైన నాటి నుంచి దేశవ్యాప్తంగా ఎంతో మందికి సోనూ సేవలు అందిస్తూనే ఉన్నారు. గతేడాది వలస కూలీల కోసం ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఈ రియల్ హీరో.. ఇప్పుడు కరోనా బాధితుల కోసం ఆక్సిజన్‌ సిలిండర్లు, మందులను సరఫరా చేస్తున్నారు. సోషల్‌మీడియా వేదికగా తనని సాయం కోరిన ప్రతి ఒక్కరికీ ఆయన ఆపన్నహస్తం అందిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫలించిన కేటీఆర్ కృషి : హైదరాబాద్ నగరంలో టీకా కేంద్రం