Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అన్నయ్య మృతదేహానికి కడసారిగా రాఖీ కట్టిన చెల్లెలు

raksha bandhan
, బుధవారం, 30 ఆగస్టు 2023 (16:08 IST)
రక్షాబంధన్‌ అంటే అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక. రాఖీ పౌర్ణమి రోజు ఎక్కడ ఉన్నాసరే.. అన్న లేదా తమ్ముడు క్షేమంగా ఉండాలని తోబుట్టువులు రాఖీ కట్టడానికి పుట్టింటికి వస్తారు. కానీ తాజాగా అన్నకు రాఖీ కట్టడానికి వచ్చిన చెల్లెలికి అనుకోని ఘటన ఎదురైంది. గుండె పోటుతో ఒక్కసారిగా అన్న తుదిశ్వాస విడిచాడు. అన్నయ్య మరణంతో ఆ సోదరి చివరిసారిగా మృతదేహానికి రాఖీ కట్టి అన్నాచెల్లెలి అనుబంధాన్ని గుర్తు చేసింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామంలో జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం, ధూళికట్ట గ్రామానికి చెందిన చౌదరి కనకయ్య అప్పటివరకు సంతోషంగానే వున్నాడు. కానీ వున్నట్టుండి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 
 
దీంతో చెల్లెలు గౌరమ్మ షాక్‌ అయ్యింది. అన్నయ్య ఇక లేదన్న సత్యాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఆ సోదరి దుఃఖాన్ని చూసి అక్కడ వారంతా కన్నీటి పర్యంతం అయ్యారు. అన్న క్షేమంగా వుండాలని రాఖీ కట్టడానికి వస్తే.. తనకు పుట్టెడు శోకాన్ని మిగిల్చి వెళ్లిపోయాడని గుండెలు పగిలేలా రోదించింది.. ఆ చెల్లెలు. ఆపై కడసారిగా అన్నయ్య మృతదేహానికి రాఖీ కట్టింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిత్తూరులో ఏనుగు బీభత్సం.. దంపతుల మృతి.. యువకుడి పరిస్థితి విషమం